05-03-2023 ఆదివారం మొదటి ఆరాధన – ఆయనయందు నిలచి యుండుడి
ఈరోజు నేర్చుకున్న నాలుగు విషయాలు.
1. దేవుని ప్రేమను కలిగి ఉండాలి.
2. దేవుని మాటలు లోబడి ఆజ్ఞలు పాటించాలి.
3. ఆయన నామమును ఒప్పుకోవాలి.
4. ఆయన శరీరము, రక్తములో పాలు కలిగి ఉండాలి.
ఆత్మీయ సందేశములు
ఈరోజు నేర్చుకున్న నాలుగు విషయాలు.
1. దేవుని ప్రేమను కలిగి ఉండాలి.
2. దేవుని మాటలు లోబడి ఆజ్ఞలు పాటించాలి.
3. ఆయన నామమును ఒప్పుకోవాలి.
4. ఆయన శరీరము, రక్తములో పాలు కలిగి ఉండాలి.
క్రీస్తు ఆత్మ యొక్క లక్షణములు
1. తండ్రి చిత్తమే నెరవేర్చుట.
2. పరిశుద్ధత కలిగి జీవించుట.
3. దేవుని మాటకు విధేయత చూపుట.
మనము గమనించవలసిన మూడు ప్రాముఖ్యమైన విషయాలు
1. కృప చేత రక్షించబడ్డాము కనుక ఆయన కృపకు మహిమకరముగా జీవించాలి
2. యేసు క్రీస్తు ద్వారా దేవుని కుమారులుగా ఉండుట
3. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలి.
యేసయ్య మాట్లాడిన ప్రతీ మాటలో ఒక అర్థము ఉంటుంది. పేతురుకు రాత్రి అంతా కష్టపడినా ఏమి దొరకని సందర్భములో, ఇంకా లోతుగా వెళ్ళి వలవెయ్యమని చెప్పారు. అలాగే, నీ ఆత్మీయమైన జీవితములో లోతుగా వెళ్ళినప్పుడే విస్తారమైనవి పొందుకోగలుగుతావు. కేవలము యేసయ్యను స్వంతరక్షకుడిగా అంగీకరించాను అనే పునాదిలోనే ఉండిపోకూడదు. నీ జీవితములోని ప్రతీ సందర్భములో, ఆయన నిన్ను నాశనమునుండి రక్షించి తప్పిచుటకు పంపబడ్డాడు అనే సత్యము ఎరిగి, ఆయన యందు నీవు నిరీక్షణ కలిగి ఉండాలి.
చాలా సందర్భాలలో మన జీవితాలలో మనకు వ్యతిరేకమైనవి మనముందు చాల కనబడుతుంటాయి. అట్టి సందర్భాలలో చాలా అందోళనకరంగా గలిబిలితోను ఉంటాము. అయితే మన దేవుడు మంచిదేవుడు. కొంతమంది జీవితాలు సాఫీగా ఉంటాయి, కొంతమంది జీవితాలు కష్టాలతో నిండి ఉంటుంది. అయితే వీరిరువురికీ కూడా ఆయనే దేవుడు. దేవునిని అర్థము చేసుకున్నట్టయితే ఆయన మంచితనాన్ని అర్థము చేసుకోగలుగుతాము. అందుకే మన జీవితాలలో దేవుని గూర్చిన నెగటివ్ ఆలోచనలు అస్సలు రానివ్వకూడదు. “నాకే ఎందుకే ఇలా” అనే ఆలోచన వచ్చినప్పుడల్లా నీవు జ్ఞాపకము చేసుకోవలసినది, “దేవుడు నన్ను ఏర్పరుచుకున్నాడు” అనే సత్యము జ్ఞాపకము చేసుకో!
ఈ లోకములో అనేకమైన మర్యాదలు, వ్యవహారములు ఉన్నాయి. అయితే వాటి ప్రకారము కాకుండా, దేవుని చిత్తప్రకారము ఏది మచిది? ఏది ఉత్తమమైనది అని తెలుసుకుని ఆ ప్రకారము చెయ్యాలి! మన శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోవాలి. బలిగా అర్పించుట అనేదానిని గమనించినపుడు, ఒకసారి అర్పించినతరువాత దానిలో ఇక ఏ మాత్రము జీవము ఉండదు. అలాగే మనము సజీవ యాగముగా మనము అర్పించినప్పుడు, మన జీవితములో ఇంతకు ముందు ఉన్న లోకానుసారమైన సంగతులు ఇక జీవించకూడదు.
ఎవరైతే యేసయ్యను అంగీకరించినవారికి మాత్రమే ఈ అవకాశము. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని ఆహ్వానము ఇవ్వబడుతుంది. దేవుడు సిద్ధపరచబడినది నీ వద్దకే వస్తుంది. యేసయ్యను అంగీకరించిన నీ ధన్యత ఇదే. నీ ఆశీర్వాదము నీదే. అది ఎలా సిద్ధపరచబడుతుందో నీకు అనవసరము. ఆయన ఏది సిద్ధపరచేనో అది కంటికి కనపడదు, చెవికి వినబడదు, హృదయమునకు గోచరముకాదు.
1. తండ్రికి నీ ప్రార్థన సంబోధించాలి
2. దేవుని మహిమ ప్రకటించాలి
3. నీ అవసరము గూర్చి అడగాలి
4. నీవు అడిగినది దయచేయు సమర్థుడవు అని ఒప్పుకోవాలి
5. యేసు నామములో సమర్పించాలి
నెగటివ్ ఆలోచనలు ఆగిపోవాలి అంటే దేవుని స్తుతించాలి. మోషే కొండమీద ఆలస్యము చేసినప్పుడు ఆ ఉద్దేశ్యాన్ని అర్థము చేసుకోలేదు. చివరికి మోషే కొండమీదనుండి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు జీవముకలిగించే మాటలు కలిగిన పలకలు తీసుకుని వచ్చాడు. వారు గనుక మోషే దేవుని దగ్గరకు వెళ్ళాడు, ఆలస్యమైనా సరే మేము ఆశీర్వదించబడటానికే ఎదో ఒకటి తీసుకొస్తున్నాడు అనే సంగతి ఎరిగి ఉంటే, అపవాది అలోచనలకి అవకాశమే ఇచ్చేవారు కాదు. మనము కూడా ఆలస్యమైనా సరే సందేహించవద్దు, వాగ్దానము ఇచ్చినవాడిని నమ్మి మహిమపరచి నిలబడదాము.
6 గంటలు స్తుతి ఆరాధన పరిచర్య. ప్రత్యేకమైన ఆరాధన పరిచర్య.