శ్యామల సిస్టర్ జీవితంలో ప్రభువు చేసిన అద్భుతం

సౌజన్య సిస్టర్ గారి తల్లిగారు అయిన శ్యామల అనే సిస్టర్ గురించి ప్రార్ధనచేసాము. ఆమె కువైట్ లో ఉంటున్నారు. 2021 జనవరిలో ఆమె పడిపోయారు అని ఫోన్ కాల్ వచ్చింది. ఆమేకు పక్షవాయువు వచ్చి ఆమె పడిపోయారు అని చివరకి తెలిసింది. అప్పటునుండి తను కోమాలోకి వెళ్ళిపోయి అచేతనంగా పడిఉన్నారు. తన పరిస్థితి ఫొటొలో చూసేసరికి కుటుంబమంతా చాల దుఃఖముతో నిండిపోయింది. డాక్టర్ గారితో మాట్లాడితే ఆమే ప్రస్తుతం ఆపరేషన్ చెయ్యడానికి కూడా కుదరని పరిస్థితిలో ఉంది అని చెప్పారు. అలాగే ఆమె బ్రతికే అవకాశము చాలతక్కువ, ఆమె మెదడులో నరాలు చిట్ట్లిపోయాయి అని చెప్పినప్పుడు కుటుంబం అంతా ఆమె చివరికాలముకొరకు మనసు సిద్ధపరచుకుంది.

సౌజన్య సిస్టర్ రాజ్ కమల్ పాస్టర్ గారితో చెప్పినప్పుడు, ఆయన మరణం నుండి ఖచ్చితంగా తప్పిస్తాడు అని చెప్పారు. అయితే సౌజన్య సిస్టర్ మావయ్యగారు ఆ విషయం నమ్మలేదు. పాస్టర్లు అందరూ అలాగే చెప్తారు, తన పరిస్థితి కష్టం అని డాక్టర్లు చెప్తున్నారు. రాజమండ్రిలో మిరాకిల్ సర్వీస్ కి సౌజన్య సిస్టర్ బలవంతంచేత వెళ్ళడం జరిగింది. అలా కొన్ని నెలలలో ఆమె కళ్ళుతెరవడం జరిగింది. అంటేకాక కువైట్లో ఒక్క పైస ఖర్చుకాకుండా, ఆ ఐ.సీ.యూ లో వైద్యం అందించడం జరిగింది. తనను ఇండియాకు పంపాలి అంటే మాత్రం ఇంకా పరిస్థితి సెట్ అవ్వలేదు అని చెప్పారు. చివరికి దానిగురించి కూడా పాస్టర్ గారితో ప్రార్ధన చెయ్యించడం మొదలుపెట్టాము. మొదట డాక్టర్ గారితో మాట్లాడాక ఆమెను కూర్చోబెట్టి పంపడము కుదరదు. దానికొరకు విమానంలో వెనక మూడు సీట్లు తీసి స్ట్రెచ్చర్ మీద పంపాలి అని చెపారు. క్రమక్రమంగా ప్రభుత్వం పరంగా, వైద్యపరంగా ఆర్ధికంగా కేవలం ప్రార్థనల ద్వారా పరిస్థితులు సరిచేయబడ్డాయి. వారం క్రితం తనను ఇండియా పంపడానికి సిద్ధమయినట్టుగా వార్త వచ్చింది. దేవునికే మహిమ కలుగును గాక.